మిత్ర లాభం
పూర్వం గోదావరి ఒడ్డున పెద్ద బూరుగు చెట్టు ఒకటి ఉండేది. ఆ చెట్టుపై లఘుపతనకము అనే కాకి నివసిస్తూ ఉండేది. అది ఓరోజు ఉదయాన్నే నిద్రలేచి తన గూడు లోంచి బయటకు వచ్చి ఓ వేటగాడిని చూసింది. తెల్లవారగానే మొదట వీడి మొహం కనిపించిందే ఈ రోజు ఏంజరుగనుందో అనుకుంటూ వేటగాడినే గమనించసాగింది కాకి. వాడు చెట్టు పక్కనే వల పరచి దానిపై నూకలు జల్లి ఓ పొదలో దాక్కుని ఉన్నాడు.
చిత్రగ్రీవుడు అనే పావురం మిగతా తోటి పావురాలతో కలిసి అప్పుడే అటుగా ఎగురుకుంటూ వచ్చి కింద నేలపై ఉన్న నూకలు చూసి “ఎవరూ లేని ఈ అడవిలోకి ఈ నూకలు ఎలా వచ్చాయి! ఇదేదో మోసంలా వున్నది, వీటికి ఆశపడి పోయామంటే బంగారు కంకణానికి ఆశపడి ప్రాణాలు పోగొట్తుకున్న బాటసారలా అవుతుంది. కనుక ఎవరూ కిందకు దిగకుండా ముందుకే వెళ్ళండి” అని అచెప్పాడు.
మిగతా పావురాలన్నీ “ బంగారు కంకణమేమిటీ, ప్రాణాలు పోటంఏమిటి!” ఆ కథ చెప్పమని చిత్రగ్రీవుడిన అడిగాయి.
